Saturday 19 March 2022

 మిత్రులకు నమస్కారములు. 

                   మనం ఏ పని చేస్తున్నా అంతా ఆ పరమాత్మే చేయిస్తున్నారు, నేను నిమిత్త మాత్రుడిని అనే భావనతో చేయాలి. ఈ పరబ్రహ్మ స్వరూపం ఈ జగత్తును నడిపిస్తున్నారో ఆ పరబ్రహ్మను తలుస్తూ మనం ఈ పని తలపెట్టి చేసినా ఆ పని సఫలీకృతం అవుతుంది. నేను, నాది అనేది ఎమీ లేదు., అంతా మీరే అని పరమాత్మను స్మరించాలి. పరమాత్మ అంటేనే ఒక శక్తి స్వరూపం. మనస్సును లగ్నం చేయటం కోసం మనం ఏదో ఒక రూపంలో ఆరాధిస్తూ ఉంటాము. మనుషులలో ఎన్నో రకాల వారు ఉంటారు. ఎవరికి తోచినట్లు వారు ఆ పరమాత్మను ఆరాధిస్తూ ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా మనం మనకు నచ్చిన దేవుని ఆరాధించి ఆత్మ జ్ఞానం పొందాలి.

Saturday 2 September 2017

మనిషిలో కోరికలు కలిగి అవితీరని సమయములో కోపం జనిస్తుంది.  ఎంతఉన్నా, ఎన్నియున్నా ఇంకాలేదో కావాలనే తపన .  మనిషి చనిపోయినప్పుడు తనతో ఏమియు తీసుకొనిపోవటం లేదని మనకు తెలిసిందే. ఈ లోకంలో  ఏదియు శాశ్వతం కాదనీ, ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటుందని తెలుసుకొని మనం చేస్తున్న పనిని చేస్తూ , ఫలితం ఏమివచ్చినా భగవత్ప్రసాదముగా భావించాలి.

Monday 5 June 2017

HANDLOOM WEAVING AT BANDARLANKA VILLAGE IN EAST GODAVARI DISTRICT., ANDH...

బండా ర్లంక లో చేనేత కళాకారుడు శ్రీ చింతా  పేరిశెట్టిగారు.

BEAUTIFUL NATURE IN KONASEEMA.

కోనసీమలో ఎటుచూసినా ప్రకృతి అందాలే కనిపిస్తాయి. కేసవదాసుపాలెం లో ఈ అందాలు చూడండి.